సత్యవతి గారు నమస్కారము,

మీ బ్లాగు తప్పక చదివే వారిలో నేను ఒకరిని, ఒక సమాజికవేత్తగా,రచయతగా, స్త్రీ వాదిగ మీ కృషి అభినందనీయం. మీ సేవలు ఇంకా ఎంతో కావాలి. మా వూరూ చిత్తూరు జిల్లా లోని నిండ్ర మండలం లో కావనూరూ పంచాయితీ దళిత వాడ, మొత్తం జనాభ 813 ఇందులో 60%మంది యువకులే. గత రెండు సంవత్సరాలుగా మా దళిత వాడలో ప్రతి మూడు నెలలకొక సారి ఒకరు ఆత్మహత్యకు గురవుతున్నారు. ఇందులో డెబ్బైఏళ్ళ పైబడిన అవ్వగారి నుంచి క్రొత్తగా వివాహం చేసుకొన్న వారే కాకుండా, పదేళ్ళ అమ్మాయిలు ఉన్నారు.  దారుణం ఏమిటంటే మొన్నటికి మొన్న   5వ తరగతి చదువుచున్న అమ్మాయి వాళ్ళ అమ్మ ఆత్మ హత్య చేసుకొన్న కొన్ని రోజుల్లోనే తను కూడా ఒంటిపై కిరోసిన్ పోసుకొని అంటించుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ రోజు మరో గృహిణి ఏదో ఆకు పసురు త్రాగి ఆత్మహత్య చేసుకొంది అని విన్న తరువాత, దీనిని ఆపడానికి తప్పక నా వంతు నేను ఏమి చేస్తున్నాను అనే ప్రశ్న నాలో వేదిస్తుంది. ఏదో చేయాలి కాని ఎలా? నేను అమెరికా వచ్చినప్పటినుంచి నాకు చేత నయినంతలో విద్యార్థులు చదువులకు, లేదా ఎవరైనా కష్టాల్లో ఉంది అనార్యోగ్యం గ ఉంటే వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నాను. నాకు ఏమీ సంస్తలు లేవు, పైన పేర్కొన్న ఆత్మహత్యల నివారణకు ఏదో చేయాలని  నా తపన ఇందులో మీ ద్వారా ఒక సమావేశం మా వూరులో నిర్వహిస్తే మిగత గృహిణులకు, వ్యక్తులకు ఒక భరోసా, ఆత్మస్తేర్యం నా భాద వినడానికి లేదా చెప్పుకోడానికి ఒకరున్నారు అనే ఆత్మవిశ్వాసం కలిగించ వచ్చని నా అభిప్రాయము.

మీ ద్వారా సమావేశము నిర్వహించాలంటే దానికి కొరకు నా ద్వారా ఏమిచేయాలి (కావలిసిన సదుపాయాలూ) మీ సేవలు మా వూరిలో కల్పించడానికి నేను ఏమి చేయాలో మరియు మీతో నేరుగా మాట్లాడాలంటే దయచేసి మీ telephone నంబరు, అడ్రస్సు   వివరించగలరు.

(మా వూరూ తిరుపతి -సత్యవేడు  మద్య ఉంటుంది సమీప రైల్వే స్టేషన్ రేణిగుంట (38KM)(chennai 75Km) nearest town puttoor 18km)

(మీ బ్లాగులో ఈ విషయాన్ని పోస్ట్ చేసాను కాని ఎందుకో, యాక్సెప్ట్  కావట్లేదు అందుకే నా బ్లాగు ద్వారా మీకు తెలియజేస్తున్నాను.)

ఒరే(తరువాయిభాగం)

Posted: మార్చి 14, 2012 in సమాజం

మురళి: పెళ్ళికి వచ్చిన వాలందరూ వాళ్ళవాళ్ళ పనిలో నిమగ్నమై ఉన్నారు, అప్పుడే నాన్న గారు “మురళి” అనిపిలిచారు నేను వెంటనే తిరిగి చూసాను. నాన్న తనవైపుకు రమ్మని సైగ చేసారు, చేతిలో ఏదో ఉంది. పరిగెత్తి ఆ సంచిలో ఏముందో చూడాలని ఆశ, వెంటనే నాన్న దగ్గరకు వెళ్ళాను తను చేతి లొ ఉన్నా సంచి నాకిచ్చి నావైపు చూచి నవ్వాడు. అప్పుడు అర్థమయింది అందులో ఏముందో, వెంటనే సంచి లోంచి బయటకు తీసి చూచా అదే నా గులాబి రంగు నిక్కరు, షర్టు నాకెంతో ఇష్టమని తనికీ తెలుసు అందుకే కాబోలు నాన్నగారు అన్న పెళ్లి రోజు నాకు ఇది కొనిపెట్టారు. అప్పుడనిపించింది ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్ట వంతులు లేరని. రెండు సంవంత్సరాల నా కల అది, అందుకే నేమో నా కళ్ళలో నీళ్ళు, వెంటనే నాన్నను గట్టిగ పట్టుకొన్నాను,నాన్న చెయ్యి నా తల నిమురుతుంది. రేపటికి ఎలాగైనా ఈ కొత్త చొక్కా లాగు స్కూల్ కు తొడుక్కొని వెళ్ళాలి అని మనస్సు లొ గట్టిగ అనుకొంటూ అలాగే నిద్రపోయాను.

అన్నా నాయుడు ఒప్పుకోవటం లేదు రేపటి నుంచే మురళి పనికేల్లాలంట, అందుకే తను 4 రూ కి ఒప్పుకొంది లేకపోతె ఇంకొంచెం ఎక్కువయ్యేది. మీరు ఎలాగైనా తనని ఒప్పించాలి లేకపోతె మాట పోతుంది అని మురళి చిన్నాన్న సుబ్బయ్య అన్నతో అన్నాడు. తల్లి లేని పిల్లలు అందులోనూ మురళి చాలా చిన్నోడు తనిని ఎలా ఒప్పించాలి అని రామయ్య బాధ పడుతున్నాడు. సరే ముందు పెళ్లి జరిగి పొతే ఆతరువాత మిగతా అనుకొని రామయ్య వంట చేస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు.

మురళి ఉదయాన్నే లేచి తన గులాబీ రంగు కొత్త బట్టలు వేసుకోన్నాడు. డప్పు వారు పెళ్లి మేళం వాయుస్తున్నారు, ప్రక్కన లౌడ్ స్పీకర్ లొ “సీతా రాముల కల్యాణ వైభోగమే” పాట వస్తుంది. అప్పుడే మంటపం మీద అన్న వదిన వచ్చి కూర్చున్నారు, పెళ్ళికి వచ్చినవారు ఒక్కక్కేరే వచ్చి గుమికూడుతున్నారు. కళ్యాణి తాత ఏదో మంత్రం లాగా చేబుతున్నాడు. ఇంతలో ఎవరో అన్నారు ముగార్తానికి సమయం అయ్యింది వెంటనే దప్పులు గట్టిగ మొగసాగాయి, మైక్ సెట్లొ పాట ఆగి పోయింది.అందరూ ఒకరినొకరు నేట్టుకొంటూ ఏదో చూస్తున్నారు, వాళ్ళ చేతిలో ఉన్నా పసుపు బియాన్ని వదూవరులమీద చల్లుతున్నారు. నేను ఆ గుంపులో వెళ్ళడానికి సాహసం చేయలేదు ఎందుకంటే నా గులాబి రంగు ద్రస్స్ పాడయిపోదూ?

ముహూర్తం అయిన తరువాత అంతా పందిరి కిందే కూర్చున్నారు, కొంతమది కుర్రవాళ్ళు అరటి ఆకులు బంతిలో ఉన్నా అందరికీ ఇస్తున్నారు, ఇంకొంతమంది అందులో పోంగల్ వడ్డిస్తున్నారు. నేను కూడా వెళ్లి అరటి ఆకు తీసుకొని బంతి లొ కూర్చున్నాను, పోంగల వడ్డించే వ్యక్తీ ఆపి అలా వెళుతున్నాడు, ఎవరో పిలిచారు అనుకొంటా. నేను నాకు పోంగల్ ఎప్పుడు పెడతారా అని ఎదురుచూస్తున్నాను. ఇంతలోనే వేరొకరు వడ్డించడానికి సిద్దమయినారు, ఎలాగైతే నేం నాకు పోంగల్ దొరికింది, మంచి వాసన ఇక పప్పు తో మారింట వాసన.ఇక నావల్ల కాదు తెనేయాల్సిండే అనుకొంటూ కలిపి ముద్ద నోటిలో పెట్టబోయాను. ఇంతలో మా అన్న నా దగ్గరికి వచ్చి నన్ను నాయన పిలుస్తున్నాడని అని చెప్పి నా చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. నేను తనతో పాటే నడవ సాగాను.

కొంత దూరంలో నాన్న ఎవరితోనో మాట్లాడు తున్నారు అవతలి వ్యక్తీ తెల్ల షర్టు పంచే తో ఉన్నారు, తను సైకిలు మీద కూర్చొని ఉన్నారు. తెల్ల పంచ వ్యక్తీది మా వాడా కాదు నేను ఎప్పుడూ చూడలేదు. తను గట్టిగ అలా కుదరదూ ఇప్పుడే పంపాలి అంటూ కేక వేస్తున్నాడు. నాన్న తో పాటు ఇంకొంచ మంది ఆ వ్యక్తీ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు నాకనిపించింది. నేను అలాగే బిత్తర చూపులతో నిలబడి పోయాను. ఇప్పుడే వస్తాను అంటూ నాన్న నాచెయ్యి పట్టుకొని మా ఇంటి వైపు నడిచాడు. నేను నాన్న ను ఫాలో అయ్యాను, ఇంటికి వచ్చిన తరువాత మా అవ్వ, అన్న నాన్న అందరూ ఏడవ సాగారు. నేను కూడా ఏడవడం ప్రారంబించాను. ఈ లోగ మా అత్తా ఒక సంచి నా చేతికిచ్చి మా నాన్న వైపు చూచి తల ఊపింది.

నాకడుపులో ఆకలి గిలిగింతలు ఎక్కువయితున్నాయి, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా వెళ్లి తిందామా అనుకొంటున్నాను. అప్పుడు నాన్న నాతొ నాయనా ఈ రోజు నీకు భోజనం మిలిటరీ నాయుడు ఇంట్లో ఇప్పుడు నువ్వు ఆయనతో సైకిలు మీద వెళుతున్నావు నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పి నన్ను సైకిలు పై ఎక్కించి వెళ్ళిపోయాడు. నేను ఏడుస్తూ సైకిలు పై నాయుడు ఇంటికి వెళ్ళాను.  (మిగతా త్వరలో)   

నా చిన్న నాటి స్నేహితులు కొంతమంది ఆర్ధిక స్తోమత లేక కొన్ని అనివార్య కారణాల వాళ్ళ చిన్నప్పుడే చదువుమాని మా ఊరి నాయుడోల్ల ఇంటిలో వెట్టిచాకిరి చెయ్యాల్సి వచ్చింది. పశువుల కాపరిగ పనిచేశారు.  వారి కుటుంభం గడవడం కోసం(కొందరు వాళ్ళ అక్క పెల్లికర్చుల అవసరం మరికొందరు ఇంట్లో పూట గడవడం కోసం, ఇంకా కొంతమంది అమ్మో లేదా నాయన గారి వైద్యంకోసం  పలక బలపం పట్టే చేతిలో పేడ తట్టే చేత బట్టారు ఇంట్లో అమ్మానాన్న ఒడిలో లేదాఒడిలో పడుకొని చంద మామ రావే, రాజు రాణి కథలు వినాల్సిన వయస్సులో పశువుల దొడ్లోనే ఎండా, చలి, గాలి వాన లొ కూడా నిదుర పోయారు. వీరికి ఆదివారం లేదు పండుగలు లేవు, చివరకు వీరికి పేర్లు కూడా లేవు. ఇక్కడ పనిచేస్తున్నకాలం  చిన్న పెద్ద అందరూ పిలిచే పేరు ఒక్కటే అది “ఒరే”. ఇలాంటి వి మానాన్న లేదా తాత గారి కాలంలో సహజం అనుకోవచ్చు కాని నేను వ్రాసే ఈ నా మిత్రుల కథ ఇప్పుడు 1980-1990 లో జరిగినవి.

నా మిత్రులు యొక్క కష్టం, త్యాగం పై ఒక కథ వ్రాయాలి అనుకొన్నప్పుడు నాకు తెలిసినవి కొంత మాత్రమే అందుకే ప్రతి రోజు కొంత నా మిత్రులకు ఫోన్ చేసి మిగతా విషయాలు తెలుసు కొంటున్నాను. మొదట కొంత సంశయించిన నేను వారికి ఇలా ఎందుకు వ్రాయాలో వివరించి చెప్పాను అప్పుడు వారన్నది విని నాకు వారి యొక్క గొప్ప క్షమా గుణానికి నాకు రెండుచేతులతొ నమస్కరించాలని తోచింది ఇంతకీ ఏమ్మన్నారంటే. అదంతా ఎందుకు వ్రాయడం నాయుడు వాళ్లకు చెడ్డ పేరు వస్తుంది, అప్పుడు మన అవసరార్థం మనం చెయ్యి చాపాము వారు ఆదుకొన్నారు. వీరు పనిచేస్తున్నప్పుడు వీరిని ఎంత నీచంగా హీనంగా చూచారో వీరికి తెలుసు అయినా ఇప్పుడు కూడా విశ్వాసంతో తను పనిచేసిన నాయుడు గారి గౌరవ మర్యాదులకు తన వాళ్ళ భంగం రాకూడదు అని చెప్పారు.

అందుకే ఈ నా బ్లాగులో ప్రతి వారం నా నలుగురు మిత్రుల చిన్ననాటి వెట్టిచాకిరి అనుభవాలు వ్రాయాలని అనుకొంటున్నాను. ఇలా వ్రాయడానికి నాకు ప్రోత్సాహం కలిగించింది మన తెలుగు బ్లాగర్లె, ఒక్కొక్క సారి మిత్రుల బ్లాగులు చదువుతోంటే అక్షరాలలో కూడా ఇన్ని విషయాలు ఉన్నాయా అని అనిపిస్తుంది. ఇంతకీ నా పై కథ పేరు ఏమిటో చెప్పలేదు కదా?  ఇంకా అటు ఇటు త్రిప్పక మేటరుకు వస్తున్న. నా కథ పేరు “ఒరే” అదే నండి బాబు నా కథా నాయకులకు వారి యజమానులు పెట్టిన ముద్దు పేరే.

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకంక్షలు

కావనూరు దళిత సంస్కృతీ,  సాంప్రదాయబివ్రుద్దికి కృషి చేసిన వారిలో నలంచు సుబ్ష్ణయ్య ఒకరు, తను కావనూరులో 1948 ప్రాంతంలో జన్మించారు, అప్పటి తన కుటుంభ పరిస్తితి వలన తను చదువుకోలేదు. భాల్యంలోనే తాను తన కుటుంబం పోషణ  కొరకు తనవంతుగ పశువుల కాపరిగా పనిచేసి వచ్చిన సంపాదనను తల్లిదండ్రులకు ఇచ్చేవారు. ఆనాటి కాలంలో దళిత కళలైన డప్పు దరువులు, పాటలును చాల చులకనగా చూసేవారు అందుకే వాటిని ఎక్కువగా వ్యక్తి మరణించినప్పుడు వారియొక్క  అంత్యక్రియల్లో ఉపయోగించే వారు. కాని నలంచు సుబ్ష్ణయ్య వాటిని అలా తక్కువ భావనతో చూడలేదు, వాటిని ఎంతో భక్తి శ్రద్ధతో సాధన చేసి  ఈ నాటికి తను ఆపాటలు పాడుతారు. ఇవేగాక తను వివిధ వీది నాటకాల్లో కూడా నటించి ప్రజల మెప్పోందారు. అంత్యక్రియల సమయంలో పాడే పాటలలో ఇప్పటికి తనకు సాటి ఎవ్వరు లేరు. కావనురులో దళిత కళాబివ్రుద్దికి తన చేసిన సేవ అబినందనియం.

పాట కొరకు ఇక్కడ నొక్కండి


ఇప్పటి వరకు మనం తినే ఆహారమైన గొడ్డు మాంసం పై కొన్ని అపవాదులు ప్రచారం చేసారు, ఆ మాంసం తినే వారిని సమాజంలో అంటరాని వారుగ ముద్ర వేసి వారిని సమాజానికి దూరంగ ఉంచే దుర్మార్గమైన పని జరిగింది. కాని దీనికి విరుద్దంగ ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు పౌష్టిక ఆహారంలో భీఫ్ కి ప్రథమ స్తానం ఇస్తున్నారు. ఇలాంటి పోషక పదార్థం పేరు  మనం స్వేచ్చగ బయటకు చెప్పుకోలేని దౌర్భాగ్య స్తితిలో ఉన్నాము. మాంసకృతులు పుష్కలంగా లభ్యమయ్యే ఆహార పదార్థాలలో భీఫ్ కే మొదటి స్తానం. 92% శాకాహారంలో విటమిను B12 లభించదు. ఇనుము పుష్కలంగా లభ్యమయ్యే ఆహార పదార్థాలలో బ్రెడ్, గోధుమ తరువాత  భీఫ్ లోనే ఎక్కువగ లభిస్తుంది.

భీఫ్ యొక్క ఉపయోగాలు:

 

  1. భీఫ్ లోని మాంసకృతులు మన శరీరానికి కావలసినంత పుష్కలంగా ఉంది.
  2. పప్పు మరియు ఇతర ఆహార ధాన్యాలలో లబ్యమయ్యే విటమినులు కనిజ లవణాలు కంటే భీఫ్ లొ లబ్యమయ్యే  విటమినులు కనిజ లవణాలు (జింకు, ఇనుము, మగ్నీసియం, ఫాస్ఫరస్) మాన శరీరంలో శులభంగ కలసిపోతాయి.
  3. విటమిను B12 భీఫ్ లొ పుష్కలంగ లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన  రక్త ప్రసరణ, నాడీ వ్యవస్త కు దోహద పడుతుంది.
  4. భీఫ్ లొ లబ్యమయ్యే కార్నితిన్ క్రొవ్వు ను జీర్ణం చేసి మన గుండెను లయబద్దంగా, నిరాటంకంగా పనిచేసెటట్లు తోడ్పడుతుంది.
  5. భీఫ్ లొ లబ్యమయ్యే లినోలెయిక్, పాల్మియోటేలిక్ లవణాలు క్యాన్సర్, షుగర్ వ్యాధి  నిరోదికారిగా పనిచేస్తుంది.
  6. భీఫ్ లొ లబ్యమయ్యే  లవణాలు ఆస్తమ రుమటాయిడ్ వాయువు నొప్పుళ తీవ్రతను తక్కువ చేస్తుంది.
  7. భీఫ్ లొ లబ్యమయ్యే  ఫాస్ఫరస్ ఆరోగ్యకరమైన దంతములకు మరియు దృడమైన ఎముకలకు అభివృద్దికి తోడ్పడుతుంది.

జై భీం ! చిన్నప్పటి నుంచి పాటశాలలో మనకు అన్నింటికంటే ముందుగా నేర్పించేది మన జాతీయ నాయకుల గురించి అందులోనూ కరం చాంద్ మోహన్ దాస్ గాంధి గురించి. ఎందుకంటే మన అగ్రవర్ణాల వారికి మన పాత సామెత అయిన “మొక్కై వంగనిది మాని వంగున” చాలా తెలుసు అందుకే ఈ చిన్న వయసు నుంచే అంబేద్కర్ గురించి తెలియజేయ కుండ మిగతా అగ్రవర్ణాల నాయకుల గురించి నూరిపోస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికి కొనసాగుతుంది, దీనిని అధిగమించి మన దళిత విద్యావంతులు ఇప్పటికైనా ఈ కుట్రను లో భాగం కాకుండా మన భావితరానికి నిజ మైన నాయకులూ ఎవరో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎవరు జాతి పిత ? ఎవరు జాతి పిత అని నిర్ధారించే ముందు భారత జాతి(భారత దేశం) యొక్క సాంఘీకంగ, ఆర్దికంగ,విద్యాపరంగ, రాజకీయ అంశాలను పరిశీలిద్దాం. ఈ విశాల భారత దేశాన్ని చాలా మంది పరిపాలించారు వారిలో మహమ్మదీయులు,ఆంగ్లేయులు, పోర్చుగీస్, ఫ్రెంచ్ వారు మరియు డచ్ వారు ముఖ్యులు. మహమ్మదీయులు భారత దేశానికి ఖురాన్ తొ మాత్రమె కాక కత్తులు, ఈటేలు తొ జయించి 700 సంవత్సరాలు పరిపాలించి భారత దేశంలో స్తిరపడ్డారు (ఈ స్తిరపడ్డ వారే భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ గ వేరుపడ్డారు.) ఆంగ్లేయులు భారత దేశానికి బైబిలు మరియు తుపాకీలు తొ వచ్చి వాళ్ళ సామ్రాజ్యాన్ని స్తాపించి 300 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు (150 సంవత్సరాలు వ్యాపార సంస్థగా మిగతా కాలం పరిపాలకులుగా.) వీరు మన దేశ సంపదనంతా కొల్లగొట్టారు కాని విద్య మరియు నాగరికత అభివృద్ధికి సహాయం చేసారు.మహమ్మదీయులు మరియు ఆంగ్లేయులు వారి వారి యెక్క మతమైన ఇస్లాం, క్రైస్తవం ను అభివృద్ధి చేసారు. ఎవరైతే చరిత్ర ను మరిచి పోయారో వాళ్ళు క్రొత్త చరిత్ర ను సృష్టించలేరు. మనము మన చరిత్రను తెలుసుకోవాలి అందులోని లోపాలును సరిదిద్ది ఇప్పటికి సరిపోయే క్రొత్త చరిత్రను మలచుకోవాలి. ఈ సందర్భంగా హరప్పా మరియు మొహంజదారో నాగరికతను పరిశీలిస్తే 4000 సంవత్సరాలైన సిందూ నది ఒడ్డున (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది) వెలిసినది. 1920 లో ఆంగ్లేయులు కనుగోనేనంత వరకు ఎవరికీ తెలియదు. ఆర్యులు వారి వేదం, యజ్ఞం, భలి లాంటి సాంప్రదాయాలతో వచ్చి పైన పేర్కొన్న నాగరికతను నాసనం చేసారు. మహమ్మదీయులు మరియు ఆంగ్లేయులు కాలంలో కూడా ఈ ఆర్యుల సంస్కృతి అయిన చతుర్ వర్ణాలైన బ్రాహ్మణ, క్చత్రియ, వైశ్య మరియు శూద్ర అనే వర్ణ వ్యవస్థను అలాగే ఈ వ్యవస్తను కంట్రోల్  చేసే మను శాస్త్రము, మను నీతిని నాసనం చేయలేక పోయాయి.

కుల వ్యవస్త: మనందరికి తెలుసు మన భారత దేశము సువిశాలమైన గొప్ప దేశము. మన దెశ చరిత్ర ఎంత పాతదో వర్ణ వ్యవస్థ లైన అంటరాని తనం, తోటి మానవులను అవమానించడం లాంటివి కూడా అంటే పాతది. ఈ మను నీతి ఇప్పటికి కూడా మనదేశంలో కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంటూ వారి యొక్క జీవన విధానాలను ప్రభావితం చేస్తున్నాయి. “భిన్నత్వంలో ఎక్కత్వం” అని చెబుతుంటాం కాని ఈ వర్ణ వ్యవస్థ వివిధ జాతులను సమానంగా కాకుండా, అంటరానితనన్ని ప్రోత్సహిస్తు, విభేదాలను సృష్టిస్తూ మన యొక్క దైనందిన జీవితాన్ని నాసనం చేస్తున్నాయి. ప్రపంచంలో మనం అమెరికన్లు, ఆంగ్లేయులు, ఆస్ట్రేలియన్లు, రస్సియన్లు మరియు చైనీయులు మొదలైన వారు ఉన్నారని విన్నం అలాగే చూస్తున్నాం. అయితే మన దేశంలో భారతీయులుగా ఎవరు చెప్పుకోరు మొదట వారు ఎ కులస్తులో చెప్పు కొంటారు ఉదా! బ్రాహ్మణులూ, క్చత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు గ ఉంటున్నారు. వీటితో పాటు రెడ్డి , నాయుడు,గౌండర్, నాయకర్ , ముదలియర్ అనే ఎన్నో కులాలు గ కూడా ఉన్నాయి. మన దళితుల్లో కూడా ఎన్నో ఉప కులాలు ఉన్నాయి. ఇలాంటి ఒక కులాన్ని నిశితంగా పరిశీలిస్తే ఉధా. యాదవులు (తెలుగులో గొల్లవారు- పశువులను, గొర్రెలను పెంచి పోసించే వారు ) తమిళంలో ఇదైయర్ మద్రాసు హైకోర్ట్ లో ఒక వ్యాజ్యం వేసారు. హిందూ దేవతలలో ఒకడైన శ్రీకృష్ణుడు కూడా గోవులను కాశాడు కాబట్టి కోర్ట్ శ్రీకృష్ణుడిని యదవుడుగా గుర్తించాలని వీరి వాదన. అందుకే ఈ కులవ్యవస్త భారత దేశానికి ఒక క్యాన్సర్ లాంటిది అనడానికి ఇది ఒక ఉదాహరణ.

ప్రాంతీయతత్వం మరియు భాష: ప్రపంచంలో చాల దేశాలలో ఒకటి లేదా రెండు భాష ఉన్నాయి. ఇలా ఒకటికంటే ఎక్కువ భాష ఉన్నా పరిపాలనకు ఒకే ఒక భాష ఉంది. కాని మన భారత దేశం లో మరొక్క పెద్ద సమస్య ప్రాంతీయతత్వం మరియు భాష. మన దేశం లో సుమారుగ 30 రాష్త్రలు మరియు 28 భాషలు ఉన్నాయి. మనకు ఎ భారతీయుడైన ఎదురైనపుడు నీవు ఎవరని అడిగితె? వెంటనే వచ్చే బదులు నేను తెలుగు వాడిని, బెంగాలి, మళయాలి,గుజరాతి లేదా మరాఠీ. అంటే దీని అర్థం సంకుచిత భావం గల ప్రాంతీయతత్వం మరియు భాషభిమానం మనలను భారతీయులు అనే భావం నుంచి దూరం చేస్తుంది. ఎప్పుడూ చెప్పే తెలుగు గడ్డ ముద్దు భిడ్డ, లేదా మరాఠ గడ్డ ముద్దు భిడ్డ అన్న భావన మన జాతీయత అభివృద్ధిని కుంటు పడేటట్లు చేస్తుంది.

మతము: ఈ ప్రపంచంలో మతం లేని దేశాన్ని, మానవాళిని ఊహించలేము. ఇక్కడ గుర్తించు కోవలసిన విషయం ఏమిటంటే మతము మనకొరకేగాని మనము మతము కొరకు కాదు. ప్రపంచ చరిత్రలో మనకు ఫ్రెంచ్ విప్లవం, రస్సియన్ విప్లవం మరియు పీసంట్ విప్లవం జరిగినది. ఈ విప్లవాలు మనవ జీవితాలను చాల ప్రభావితం చేయడమే గాక మతాల అభివృద్ధి మరియు మార్పుకు నాంది పలికింది. ఈ సమయంలో ఇలా మార్పుకు నాంది పలికిన మతాలు క్రైస్తవము,ఇస్లాం మరియు భౌద్ధ మతము. మత కలహాలు వళ్ళ ఐరోపాలో ప్రోతెస్తంట్ అనే క్రొత్త విభాగం క్రైస్తావంలో ఏర్పడినది. భారత దేశంలో కూడా హిందువులు మార్పును కోరుకొన్నారు. ఎలాంటి మార్పును కోరుకొన్నారు?  మతకలహాల వాళ్ళ ఒరిగినది ఏమిటి? ఈ క్రింద చూద్దాం. హిందూ మతములో ప్రదానంగా రెండు భాగాలు ఒకటి శైవము-శివుని పూజించే వారు మరొకటి వైష్ణవము –విష్ణు దేవుణ్ణి పూజించేవారు. ఇందులో కూడా ఉపవిభాగాలు ఉత్తరాది-ఉత్తర భారత దేశంలో నివసించే వారు , ధక్షినాది-ధక్షిన భారత దేశంలో నివసించే వారు. ఈ ఇద్దరి మద్య మత పరమైన చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అలాగే ఈ వైరుధ్యం చాలా కాలం నుంచి ఉంటున్నాయి. ఈ వైరుధ్యానికి ప్రదాన కారణం ఏమిటంటే మందిరం ముందు ఉండే గజరాజు (ఏనుగు) కు వైష్ణవ తిలకమైన నామం పెట్టాలా లేదా శైవ తిలకమైన విభూది పెట్టాల అన్న విషయం మీద జరిగింది. ఇదే విషయం పై మద్రాసు హైకోర్ట్ లో ఒక వాజ్యం పై స్పందిస్తూ మొదటి ఆరు మాసాలు వైష్ణవ నామం మిగత ఆరు మాసాలు శైవ తిలకం పెట్టాలని తీర్పునిచ్చారు. మతము ఒక వ్యాది లాంటిది అది మనదేశాన్నే నాసనం చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.

ఈ లాంటి భిన్న మతాలు, భాషలు, ప్రాంతాలున్న  దేశానికి అందరకి అమోదయోగ్యమైన రాజ్యాంగమును రూపోందించుట సాధ్యమేనా? బయపడకండి నా అభిప్రాయాన్ని మీ పై బలవంతంగా రుద్దను? మొదట డా.బాబాసహాబ్ ఏమ్మన్నారో చూద్దాం ఒకసారి శ్రీ. M.O. మతై గారు I.C.S నెహ్రు గారి వ్యక్తిగత కార్యదర్శి మరియు తన మిత్రుడైన శ్రీ. పనిక్కర్, డా.బాబాసహాబ్ ఇంట్లో కలసిన  సందర్భంలో  మతై గారు  , డా.బాబాసహాబ్ ను నెహ్రు గారి మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రి గ తీసుకోవాలనుకొంటున్నారు అన్నారట. వెంటనే , డా.బాబాసహాబ్ గారు చెప్పారు మీకు తెలుసా! హిందువులు వేదం కొరకు బ్రాహ్మణుడు కానటువంటి వ్యాసుడిని పిలిచారు. అలాగే రామాయణం కొరకు దళితుడైన వాల్మీకిని పిలిచారు. మరి ఇపుడు వారికి రాజ్యాంగం కావాలి కనుక దళితుడైన నా అవసరం వచ్చింది. దీనిలో ఆశ్చర్య పడవలసిన ఏమీ లేదు అన్నాడట.

డా.బాబాసహాబ్ అంబేద్కర్ ఎవరు?భారతదేశం లో  ఎందరో మహాను భావులు ఉన్నారు అందులో అగ్రగణ్యుడు మరియు కారణ జన్ముడు మన డా.బాబాసహాబ్ అంబేద్కర్. తను ఒక అర్థికా శాస్త్రవేత్త, సంపాదకుడు, న్యాయకోవిదుడు, విద్యావేత్త, అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్త అంతే గాక భారత దేశంలో అంతంత మాత్రంగా ఉన్న భౌద్దమతానికి ఒక క్రొత్త ఒరవడిని సృష్టించిన మహోన్నతుడు. దెశ విదేశాలలోని వివిధ విధ్యాపీటాలు తనను గౌరవ డాక్టరేటుతో సత్కరించాయి. అన్నింటికంటే తను రాజ్యంగా నిర్మాతగ సుప్రసిద్దులు. ప్రపంచంలో ప్రసిద్దిగాంచిన 6 మేధావులలో అంబేద్కర్ ఒకరుగా ఆ కాలంలో గొప్పగ చెప్పుకొనేవారు. భరత మాత ముద్దుబిడ్డగ తను ఈ సమాజంలోని సాంగీక, సామాజిక, ఆర్ధిక, మత, విద్య మరియు రాజకీయ పరమైన అసమానతలను మరియు అటువంటి అసమానతలకు మూలమైన కారణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారు ఎవరైనా మనదేశంలో ఉన్నారంటే అది డా.బాబాసహాబ్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే! అటువంటి మహానుభావుడు మన రాజ్యాంగాన్ని వ్రాయడం మన అదృష్టం, తన యొక్క గొప్ప తనం  రాజ్యంగం లోని ఉపోద్ఘాత ప్రకటన వాఖ్యాన్ని చదివితే తెలుస్తుంది.

  “ భారత ప్రజలైన మేము భారత రాజ్యంగం ప్రసాదించిన  ప్రతి పౌరుడి హక్కులు కాపాడుతాం, భారత దెశ సరబౌమత్వాన్ని కాపుడుతూ ,  ప్రతి పౌరుడికి ఆర్ధిక, సాంఘీక, సామాజిక అవకాశాలు  సమానంగా  అందేల చేసి  ఈ జాతి యొక్క ఐక్యతకు తోడ్పడుతాం అని ప్రతిజ్ఞ చేస్తూ ఈ రాజ్యాంగాన్ని 26 నవంబరు 1949 జాతికి అంఖితం  చేస్తున్నాం”.      

పైన పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే డా.బాబాసహాబ్ అంబేద్కర్ రాజ్యంగా నిర్మాత మే కాదు తనే అసలైన జాతి పిత అని మనకు అర్తమవుతుంది.

సంక్రాంతి పండుగ మూడవ రోజు మా ఊరిలో చాలా కలర్ ఫుల్ గ ఉంటుంది, ప్రత్యేకంగ విచిత్ర వేశాదరణ దరించి యువకులు వివిధ భంగిమలో కనిపిస్తారు. ఇందులో కొంత మంది భవిష్య వాణి చెప్పే వారుగ ఉంటారు, వారు పాడే పాటనే ఇక్కడ వ్రాస్తున్నాను.

 

నువ్వు ఎగిసి ఎగిసి ఎగిరే  “అల్లా హేను”

మీకు త్వరలో పెళ్లి జరుగు “అల్లా హేను”

మీకు పిల్ల పాప కలుగు “అల్లా హేను”

నువ్వు త్వరలో రాజ్యంమేలు “అల్లా హేను”

నీకు జీత బత్యం పెరుగు “అల్లా హేను”

నీ ఋణము రోగము తరుగు “అల్లా హేను”

నీకు సుఖము ధనము కలుగు “అల్లా హేను”

నీ పేరు ఊరు పెరుగు “అల్లా హేను”

నీకు అంతా శుభము కలుగు “అల్లా హేను”

మీ వంశ వృక్షము పెరుగు “అల్లా హేను”

 

ఈ పాట ఎవరు మొదట కట్టారని తెలుసుకోవడానికి ప్రయత్నించాను, కొందరిని అడిగినపుడు వారిచ్చిన సమాదానం ఒక్కటే “ఇది ఆనోట ఈ నోట విని పాడుతున్నారు కాని ఎక్కడా ప్రచురించ లేదు. ప్రతి యొక్క లైను చివర “అల్లా హేను” అని ఎందుకు అన్నారో తెలుసు కోనే ప్రయత్నం లొ ఉన్నాను.

అది నేను డిగ్రీ పూర్తీ చేసినా రోజులు, ఇక డిగ్రీ పరీక్షలు అయిపోయాయి కదా అని నేను విశ్రాంతి కోసం లేదా కొంత విరాం కోసం మా ఊరు వెల్ల బుద్దికాలేదు. అందుకే మా సీనియర్ ఒకరిని ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని అడిగాను. తను అప్పుడు మెడ్ ప్లస్ లొ ఒక పెరుగాంచిన ఇ యం టి దగ్గర పనిచేస్తుండేవాడు. అందుకే తనిని అడిగాను తను సరే నని నన్ను కూడా అదే సెంటర్ లొ పని చెయ్య మన్నారు. ఇక ఉండడానికి రూం చూడాలి ఎలాగని ఆలోచిస్తుంటే మా ఊరి  మహేష్ గుర్తుకొచ్చాడు. వెంటనే బయలుదేరి తనుండే రామనార్ గుండు (హైదరాబాద్) కి వెల్లి తనిని కలిసి విషయం చెప్పాను. మహేష్ మరియు అతని మిత్రుడు ఇద్దరూ నేను చదివిన కాలేజీ లోనే డిప్లోమా చేసి ఇప్పుడు ఒక సంస్థ లో పని చేస్తున్నారు.  ఒక వారం తరువాత నేను హాస్టల్ కాలి చెయ్యాలి కనుక అంతకు ముందే వాళ్ళు నన్ను రూము కి చేర్చు కొంటే మంచిదని చెప్పను వాళ్ళు అలాగె నువ్వు నీ సమానులు రేపే తీసుకోచ్చేయ్యి అన్నారు. నాకు చాల సంతోష మయ్యింది, ఇక నేను లేట్ చేయ్యదలచలేదు ఎందుకంటే ఒక వేల వారి మనస్సు మారితే?

మరుసటరోజు   నా పెట్టె బేడా సర్దుకొని హాస్టల్ లొ నా జునియర్స్ కి టా టా బాయ్ బాయ్ చెప్పి రాంనగర్ గుండు లొ సేటిల్ అయ్యాను. అప్పటినుంచి కొత్త లైఫ్ ప్రారంభమయింది, కొద్ది రోజుల తరువాత మహేష్ స్న్హేహితుడు మరొకడు మాతొ రూం లొ జాయిన్ అయ్యారు తనపేరు కూడా మహేష్ కాని తనికి నాయుడు మహేష్ అని పిలేస్తేనె సంతోషం, తనేదో కంప్యూటర్ కోర్స్ చేయడానికి ఊరి నుంచి హైదరాబాద్ కి వచ్చారు. రెండు నెలల తరువాత మొదటి మహేష్ కి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని తను రూము ఖాళి చేసి ఊరు వెళ్ళిపోయారు. ఇక నాయుడు మహేష్, రవి, నేను ముగ్గురం రూం షేర్ చేసుకొంటూ ఉన్నాం. ఇందులో రవి (మాదిగ), నేను (మాల)దళితులం, ఇక వేరే అతని గురించి చెప్పర్కర్లేదు ఎందుకంటే తన పేరు తొ జత చేసాడుగా తానెవరో చెప్పడానికి. వంట చేయడం కలసి బోంచేయడం వారాంతపు సెలవుల్లో సిటీ తిరగడమే మా పని. కొన్ని సార్లు నాయుడు మహేష్ కి డబ్బులు ఇబ్బంది అయ్యేవి అటువంటపుడు నన్ను అడిగి తీసుకొనే వాడు, మరి కొన్నింటికి అడగక పోయిన నేనే పెట్టె వాడిని. ఒకసారి నాయుడు మహేష్ బందువుల పెళ్ళికి తను వెళ్ళాలి కాని తన దగ్గర డబ్బులు లేవు అంతే గాక తను వరుసగా మూడు నెలల రెంట్ కూడా ఇవ్వలేదు. అవన్నీ నేనే బరించాను. ఇక్కడ గమ్మతైన విషయం ఏమిటంటే డబ్బులు లేని సమయాల్లో వాళ్ళ కుటుంబం ఎంత గొప్పదో ఎంత మంది పలేగార్లు, ఎంత ఆస్తి ఉన్నాయో చేపుకోచ్చే వాడు, అంతే గాక తను ఈ కుల వ్యవస్తకు వ్యతిరేకమని లెక్షర్ ఇచ్చేవాడు. ఇంకొంచం ముందుకెళ్ళి తను మాతో ఉండడం  వాళ్ళ అమ్మానాన్నల కి ఇష్టం లేదని కాని తను కుల వ్యవస్తను రూపు మాపడానికి మాతో పాటు కలసి ఉంటున్నా డని ఇదేదో దేశానికి చేసినా  పెద్ద త్యగంలా చెప్పుకోచ్చే వాడు.

నా P.G. ఎంట్రన్స్ పలితాలు వచ్చాయి, అందులో నాకు మైసూర్ లొని జాతీయ సంస్థలొ సీటు రాలేదు, బొంబాయిలోని జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ లొ సీటు వచ్చింది. పదిరోజులలో జాయిన్ అవ్వాలి అని తెలిసింది సరే అని ఈ లోగ ఊరు వెళ్లి వద్దాం అనుకొని మా రూం మెట్స్ కి చెప్పాను వాళ్ళు కూడా చాలా సంతోషించారు. నేను నా పెట్టె బేడా సర్దుకొని బయలు దేరాను నాతొ పాటు రవి, మహేష్ ఇంకో ఇద్దరు మిత్రులు కూడా నాతొ పాటే రైల్వే స్తేషన్ కి నన్ను సాగనంపడానికి వచ్చారు. అందరం కలసి స్టేషన్ ముందు ఉన్న హోటల్ లొ బిరియాని తిన్నాము ఆతరువాత ట్రైన్ వచ్చే సమయానికి ప్లాట్ఫారం కి వచ్చాము. నేను రైలు ఎక్కే ముందు మహేష్ నాతొ ఏదో పర్సనల్ గ మాట్లాడాలని పిలిచాడు సరే నని నా లగెజి నా సీటు లొ పడేసి తన దగ్గరికి వెళ్లాను, అప్పుడు తను నాతొ అన్న మాటలకి నాకే షాక్ అయ్యింది. ఇంతకీ తనేమన్నాడంటే మనము కలసి ఒకే రూములో ఉండడం, భోజనం చేయడం ఊర్లో చెప్పొద్దూ నా పరువు పోతుంది అని అన్నాడు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే నాయుడు దళితుడితో కలసి మెలసి ఉంటే ఎలా పరువు పోతుందని?.

పాలగండ ఎలేలాం పట్టణమా “ఐలేస”

సూర్యకోటి ఎలేలాం లక్షిమియాం “ఐలేస”

ఊరు వోరం ఎలేలాం కొలతడియలె “ఐలేస”

నిక్కిరాలాం  ఎలేలాం లక్షిమియాం “ఐలేస”

డిల్లి ఆలుం ఎలేలాం రాజా దానే “ఐలేస”

కొలతందడియే ఎలేలాం పడుకిరాన్నా “ఐలేస”

కొలతంగరే ఎలేలాం ఒరతిలే “ఐలేస”

కుదరేదానే ఎలేలాం కట్టిరిక్కాం “ఐలేస”

వోడంబలందు ఎలేలాం వొరింగోరింగీ “ఐలేస”

పడుతుకిను ఎలేలాం తూంగీరాన్నా “ఐలేస”

ఇంద సూర్య కోటి ఎలేలాం లక్షీమీదా “ఐలేస”

తంగె కరె ఎలేలాం కోడమెడుతూ “ఐలేస”

తంగె కరె ఎలేలాం కోడమెడుతూ “ఐలేస”

తన్నీకీదా ఎలేలాం వారాలమ్మా “ఐలేస”

అంద రాజ్యనియే ఎలేలాం పాత్తల్లవో “ఐలేస”

నమ్మ లక్షీమీదా ఎలేలాం నిక్కిరాలాం “ఐలేస”

ఎంద వూరు ఎలేలాం ఎంద నాడూ? “ఐలేస”

ఎన్న వేలో ఎలేలాం ఇంగే వందే రాజా? “ఐలేస”

డిల్లి ఆలుం ఎలేలాం రాజ్యం ఎందీ “ఐలేస”

నీ ఎంద వూరు ఎలేలాం అన్ను కేకురానా? “ఐలేస”

పాలగండ ఎలేలాం నా పోరంద వూరూ “ఐలేస”

సూర్యకోడి ఎలేలాం లక్షిమీ నా “ఐలేస”

ఏయి అన్నే ఎలేలాం నా తంగెల్లవో “ఐలేస”

సూర్యకోడి ఎలేలాం లక్షిమీ నా “ఐలేస”

ఇరువురము ఎలేలాం కలందికినా “ఐలేస”

పాలగండ ఎలేలాం పోరాంగలాం “ఐలేస”

యా ఏయి పేరే ఎలేలాం తంబిమారే “ఐలేస”

డిల్లి రాజా ఎలేలాం ఇంగె వందా “ఐలేస”

యా అన్నమారే ఎలేలాం తంబిమారే “ఐలేస”

నా డిల్లి రాజా ఎలేలాం కూడా పోరే . “ఐలేస”

ఈ పాట వీడియో కొరకు ఇక్కడ నొక్కండి, దీనిని స్కైప్  ద్వారా రికార్డు చేసాను క్లారిటి అంత మంచిగరాలేదు.

శ్రివల్లియమ్మ

శ్రివల్లియమ్మ జన్మస్తలం రాయిపేడు, చిరుప్రాయంలోనే తన మేనమామతో వివాహం జరిగింది. తనకు పాటలంటే ఇష్టం, ప్రత్యేకంగా జానపద పాటలు పాడడమంటే మహా ఇష్టం. తనకు గ్రహణం మొర్రి ఉన్న కూడా అవేమి తన పాటల సాధనకు అడ్డురాలేదు. ఈ చుట్టుప్రక్క ప్రాంతాలలో శ్రివల్లమ్మ పాటలు తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలు, పెద్దలు కూడా ఆమె పాటలోని మాధుర్యానికి ముగ్డులయ్యేవారు. తన పాట ప్రత్యేకంగ గ్రామీణ ప్రాంతంలో జరిగే కుల వివక్షత  మీద, సమాజంలో స్త్రీల ఫై జరిగే దాడుల ఫైన ఉంటాయి. అంతే గాక గ్రామీణ ప్రాంతంలో జరిగే ప్రతి సంఘటనలు  తన పాటలో ఉంటుంది,   గొబ్బియలో, డిల్లి రాజ మరియు  అంజల్ల-మంజల్ల అనేవి  ఆణి ముత్యాలుగా చెప్పుకో వచ్చు. శ్రివల్లమ్మ ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా ఎన్నో పాటలు పాడాలని  కోరుకొందాం.